లైంగికదాడి కేసులో నిందితుడికి 20ఏళ్ల జైలు
ABN , Publish Date - Apr 30 , 2024 | 12:35 AM
బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి 20ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ సోమవారం రంగారెడ్డి జిల్లా స్పెషల్ పోక్సో కోర్టు తీర్పు ఇచ్చింది.
![లైంగికదాడి కేసులో నిందితుడికి 20ఏళ్ల జైలు](https://media.andhrajyothy.com/media/2024/20240428/hh_4d0def00a5.jpg)
మంచాల, ఏప్రిల్ 29 : బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి 20ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ సోమవారం రంగారెడ్డి జిల్లా స్పెషల్ పోక్సో కోర్టు తీర్పు ఇచ్చింది. మంచాల సీఐ బబ్యానాయక్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. 2016లో లోయపల్లికి చెందిన బూడిద బాలనర్సింహ(43) బంధు వు ఇంటికి వచ్చిన మానసిక పరిస్థితి సరిగాలేని బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ గంగాధర్ కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం పోక్సో చట్టం ప్రకారం ఎల్బీనగర్ 9వ అదనపు కోర్టు నిందితుడికి 20సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ తుదితీర్పు వెళ్లడించింది. బాధితురాలికి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ బాధితురాలికి అందజేయాలని ఆదేశించింది.