Share News

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:10 AM

మండల పరిధిలోని టేకులపల్లి గ్రామానికి చెందిన బుడ్డోళ్ల రాజు(23) మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్యాయత్నం

పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో

కొందుర్గు, ఏప్రిల్‌ 18: మండల పరిధిలోని టేకులపల్లి గ్రామానికి చెందిన బుడ్డోళ్ల రాజు(23) మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈమేరకు గురువారం రాత్రి సెల్ఫీ వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడు. అందులో రాజు మాట్లాడుతూ తన కారణంగా ఐదారు నెలల క్రితం ఓ యాక్సిడెంట్‌ జరిగిందని, ప్రతిఫలంగా బాధితుడికి పరిహారం కింద రూ.5లక్షలు ఇచ్చామని తెలిపాడు. దాంతో తన తండ్రి ప్రతిరోజూ దూషిస్తున్నాడని, తనకున్న బాధలకు మనస్తాపంతో పురుగుల మందు తాగుతున్నానని పేర్కొన్నాడు. చివరగా మద్యం సేవించడం ఆపివేయాలని తన తండ్రిని కోరాడు. కాగా, తాను షాద్‌నగర్‌ పరిసర ప్రాంతంలో ఉన్నానని.. మిత్రులకు చివరిసారి బైబై చెప్పాడు. ఆ తరువాత ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసినట్లు తెలుస్తోంది. కాగా, రాజు ఆచూకీ కొరకు కుటుంబసభ్యులు, మిత్రులు వెతికారు. అయినా ఫలితం లేకపోయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని కొందుర్గు పోలీసులు తెలిపారు.

Updated Date - Apr 19 , 2024 | 07:55 AM