Share News

తాండూరులో మహిళ దారుణ హత్య

ABN , Publish Date - Apr 07 , 2024 | 12:08 AM

పట్టణంలోని బీసీ శ్మశానవాటికలో ఓ వివాహిత దారుణహత్యకు గురైంది.

 తాండూరులో మహిళ దారుణ హత్య

తాండూరు, ఏప్రిల్‌ 6: పట్టణంలోని బీసీ శ్మశానవాటికలో ఓ వివాహిత దారుణహత్యకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గి మండలం గుండుమల్‌ గ్రామానికి చెందిన తిరుపతమ్మ(40) 25ఏళ్ల కిందట కోస్గి మండలం ముశ్రీఫా గ్రామానికి చెందిన హనుమంతుతో పెళ్లి జరగగా పిల్లలు పుట్టకపోవడంతో 10సంవత్సరాల కిందట భర్త ఆమెను వదిలేశాడు. అప్పటి నుంచి ఆమె తన తల్లి ఇంట్లో ఉంటోంది. రెండు నెలల కిందట తిరుపతమ్మ తాండూరులోని సాయిపూర్‌లో తన అక్క సుజాత ఇంట్లోఉంటూ పలు ఇళ్లల్లో వంట మనిషిగా పనిచేస్తోంది. రోజూలాగే శుక్రవారం కూడ పనికి వెళ్లే తిరుపతమ్మ తిరిగి ఇంటికి రాకపోవడంతో అక్క సుజాత ఆమె ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలో శనివారం తిరుపతమ్మ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సుజాత తన అక్కను ఎవరో హత్యచేసి చంపారని తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. జిల్లా క్లూస్‌టీం, పోలీసు జాగిలాలు పరిశీలించారు. లైంగికదాడి చేసి హత్య చేశారా? అనే విషయమై మెడికల్‌ రిపోర్టులు వచ్చాక తెలుస్తుందన్నారు. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే విషయాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి వెల్లడించారు.

Updated Date - Apr 07 , 2024 | 12:08 AM