Share News

భవనంపై నుంచి పడి మూడేళ్ల చిన్నారి మృతి

ABN , Publish Date - Mar 31 , 2024 | 12:17 AM

భవనం పై నుంచి పడి మూడేళ్ల చిన్నారి మృతిచెందింది. ఈ ఘటన కీసర పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో శనివారం చోటుచేసుకుంది.

భవనంపై నుంచి పడి మూడేళ్ల చిన్నారి మృతి
చిన్నారి టౌషిక (ఫైల్‌)

కీసర రూరల్‌, మార్చి 30: భవనం పై నుంచి పడి మూడేళ్ల చిన్నారి మృతిచెందింది. ఈ ఘటన కీసర పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. కీసర సీఐ వెంకటయ్య కథనం ప్రకారం.. సాయికుమార్‌ అనే వ్యక్తి తన కుటుంబసభ్యులతో కలిసి నాగారం మున్సిపాలిటీ ఈస్ట్‌ గాంధీనగర్‌లో నివాసముంటున్నాడు. తన టౌషిక(3) అనే కూతురు ఉంది. కాగా ఆ చిన్నారి ప్రమాదవశాత్తు శుక్రవారం రాత్రి కాలుజారి మొదటి అంతస్తు నుంచి కింద పడిపోయింది. బలమైన గాయాలు కావటంతో తల, చెవి నుంచి రక్తస్రావమైంది. వెంటనే చిన్నారిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న జనని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి అంకుర ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Mar 31 , 2024 | 12:17 AM