Share News

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:23 AM

మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలకు చెందిన 2002-03 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థులు ఒకేచోట చేరారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
దోమ: సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు

దోమ, మార్చి 10: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలకు చెందిన 2002-03 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థులు ఒకేచోట చేరారు. స్థానిక ఎస్‌జీ గార్డెన్‌ ఇందుకు వేదికైంది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులంతా వారికి విద్యాబుద్దులు నేర్పిన ఉపాధ్యాయులు బుచ్చిరెడ్డి, రవీందర్‌గౌడ్‌, మల్లయ్య, సుభాష్‌, శ్రీనివా్‌సరెడ్డి, మహేందర్‌, శ్రీనివా్‌సగౌడ్‌, శ్రీనివా్‌సలను సన్మానించారు. పూర్వ విద్యార్థులంతా 20ఏళ్ల నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం ఆటపాటలతో సందడిగా గడిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఖాజపాష, చంద్రబోస్‌, శ్రవణ్‌కుమార్‌రెడ్డి, రమేశ్‌, భీమయ్య, రఫీక్‌, నజీర్‌ తదితరులు పాల్గొన్నారు.

కొర్రెములలో..

ఘట్‌కేసర్‌ రూరల్‌: కొర్రెముల జిల్లా పరిషత్‌ పాఠశాల 2010-2011 బ్యాచ్‌ విద్యార్థుల పూర్వవిద్యార్థుల సమ్మేళనాన్ని ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. నాటి విద్యార్థులు, గురువులను శాలువాలతో సత్కరించి, పాదాభివందనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అరుణ్‌కుమార్‌, పాండురంగం, నర్సింహులు, శివకుమార్‌, తిరుమల్‌రెడ్డి, అదినారాయణ, నాయక్‌, మల్లేష్‌, రాజేశ్వర్‌రెడ్డి, సుమీల, 2010-2011 బ్యాచ్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 12:23 AM