Share News

పోలీస్‌స్టేషన్‌లో వ్యక్తి హల్‌చల్‌.. కేసు నమోదు

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:58 PM

మద్యం మత్తులో పోలీస్‌స్టేషన్‌కు వచ్చి హల్‌చల్‌ చేసిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు బషీరాబాద్‌ ఎస్‌ఐ రమేష్‌ సోమవారం తెలిపారు.

పోలీస్‌స్టేషన్‌లో వ్యక్తి హల్‌చల్‌.. కేసు నమోదు

బషీరాబాద్‌, మార్చి 4: మద్యం మత్తులో పోలీస్‌స్టేషన్‌కు వచ్చి హల్‌చల్‌ చేసిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు బషీరాబాద్‌ ఎస్‌ఐ రమేష్‌ సోమవారం తెలిపారు. మండలంలోని ఎక్మాయి గ్రామానికి చెందిన కార్రె మంజూనాథ్‌ అనే వ్యక్తి మద్యం తాగి పోలీస్‌స్టేషన్‌కు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ఎదో కేసు విషయంలో ఆరాతీస్తూనే అక్కడున్న పోలీసులపై విరుచుకుపడ్డాడు. అతడికి ఎంత చెప్పినా వినకుండా పోలీసులను దుర్భాషలాడాడు. దీంతో ఎస్‌ఐ బ్రీతింగ్‌అనలైజర్‌ పరికరం తెప్పించి పరీక్షించారు. ఆల్కహాల్‌ శాతం 180 వరకు చూపించడంతో సదరు వ్యక్తిని మత్తు దిగేవరకూ పోలీస్‌స్టేషన్‌లోనే కూర్చోబెట్టారు. అతడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Mar 04 , 2024 | 11:58 PM