రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , Publish Date - Apr 25 , 2024 | 11:30 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శామీర్పేట్ పోలీ్సస్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది.
మూడుచింతలపల్లి, ఏప్రిల్ 25: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శామీర్పేట్ పోలీ్సస్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శామీర్పేట్ గ్రామానికి చెందిన మెహీన్(26) చికెన్షా్ప నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం పనిమీద తన బైక్పై తూంకుంట నుంచి శామీర్పేట్ వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో ఓఆర్ఆర్ సమీపం వద్ద ఎదురుగా కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు అతివేగంగా వస్తున్న లారస్ లాబ్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మెహీన్ కి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108లో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.