రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , Publish Date - Mar 12 , 2024 | 12:14 AM
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన కొడంగల్లో సోమవారం చోటుచేసుకుంది.
![రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కొడంగల్ రూరల్, మార్చి 11: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన కొడంగల్లో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ భరత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కొడంగల్ మండలంలోని నాజ్ఖాన్పల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్రెడ్డి(40) సోమవారం గ్రామం నుంచి పనినిమిత్తం కొడంగల్కు వచ్చాడు. ఈక్రమంలో తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా కొడంగల్లోని మన గ్రోమోర్ ఫర్టిలైజర్స్ దుకాణం వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టగా రాజశేఖర్రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.