Share News

గుర్తుతెలియని వాహనం ఢీకొని కొండగొర్రె మృత్యువాత

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:22 AM

గుర్తుతెలియని వాహనం ఢీకొనటంతో కొండ గొర్రె మృతి చెందిన ఘటన ధారూరు సమీపంలోని కత్వ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. డీఎ్‌ఫఆర్వో జగన్‌మోహన్‌, ధారూరు బీట్‌ ఆఫీసర్‌ నరేష్‌ తెలిపిన ప్రకారం..

గుర్తుతెలియని వాహనం ఢీకొని కొండగొర్రె మృత్యువాత

ధారూరు, మార్చి 8 : గుర్తుతెలియని వాహనం ఢీకొనటంతో కొండ గొర్రె మృతి చెందిన ఘటన ధారూరు సమీపంలోని కత్వ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. డీఎ్‌ఫఆర్వో జగన్‌మోహన్‌, ధారూరు బీట్‌ ఆఫీసర్‌ నరేష్‌ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని కేరెల్లి వైపు నుంచి కొండ గొర్రె రోడ్డుపై పరిగెత్తుకుంటూ ధారూరు వైపు వెళ్తోంది. ఈక్రమంలో ధారూరు నుంచి వికారాబాద్‌ వైపు ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం(బైక్‌) ధారూరు సమీపంలోని కత్వ వద్ద కొండ గొర్రెను బలంగా ఢీకొంది. దాంతో చాతీ, కాళ్ల భాగంలో బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆనంద్‌ మృతిచెందిన కొండగొర్రెను పరిశీలించారు. పశువైద్య సిబ్బందితో పోస్టుమార్టం నిర్వహించారు.

Updated Date - Mar 09 , 2024 | 12:22 AM