Share News

లాడ్జిలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ABN , Publish Date - Apr 13 , 2024 | 11:54 PM

తాండూరు పట్టణంలోని లాడ్జిలో ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 లాడ్జిలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

తాండూరు, ఏప్రిల్‌ 13: తాండూరు పట్టణంలోని లాడ్జిలో ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. కొడంగల్‌ మండలంలోని టేకులకోడ్‌ గ్రామానికి చెందిన శామప్ప(65) శుక్రవారం తాండూరులో ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుని పట్టణంలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్లి భోజనం చేశాడు. అనంతరం వారింట్లో పడుకోకుండా శాంతినగర్‌లోని అవేక లాడ్జిలో రాత్రి బసచేశాడు. కాగా, శనివారం ఉదయం గది తలుపులు తీయకపోవడంతో గమనించిన లాడ్జి సిబ్బంది తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే బాత్రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసున్నాడు. మృతుడికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఏడాది కిందట కుమారుడు మృతిచెందాడు. అప్పటి నుంచి మానసిక వేదనతో ఉన్న శామప్ప ఉరేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని తాండూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో శవపరీక్ష చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు.

Updated Date - Apr 13 , 2024 | 11:54 PM