కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - Mar 28 , 2024 | 11:57 PM
కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు తాండూరు మండలం కరన్కోట్ ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.
తాండూరు రూరల్, మార్చి 28: కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు తాండూరు మండలం కరన్కోట్ ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నాగారం వీరేశం(48) గురువారం కడుపు నొప్పి రావడంతో భరించలేక పురుగులమందు తాగాడు. కుటుంబీకులు వెంటనే తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.