Share News

ఘనంగా మల్లన్న కల్యాణోత్సవం

ABN , Publish Date - Jan 29 , 2024 | 12:02 AM

మండల పరిధిలోని హామీదుల్లానగర్‌లో మల్లికార్జున స్వామి (మల్లన్న) కల్యాణోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌, మైలార్‌దేవుపల్లి కార్పొరేటర్‌ తోకల శ్రీనివా్‌సరెడ్డి, జడ్పీటీసీ నీరటి తన్వీరాజు, ఎంపీపీ జయమ్మశ్రీనివాస్‌ పాల్గొని మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఘనంగా మల్లన్న కల్యాణోత్సవం

శంషాబాద్‌రూరల్‌ ,జనవరి 28 : మండల పరిధిలోని హామీదుల్లానగర్‌లో మల్లికార్జున స్వామి (మల్లన్న) కల్యాణోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌, మైలార్‌దేవుపల్లి కార్పొరేటర్‌ తోకల శ్రీనివా్‌సరెడ్డి, జడ్పీటీసీ నీరటి తన్వీరాజు, ఎంపీపీ జయమ్మశ్రీనివాస్‌ పాల్గొని మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు గ్రామంలోని మహిళలంతా బోనాలను నెత్తి పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లిన స్వామివారికి బోనాలను సమర్పించారు. ప్రతి ఏడాది మల్లన్న జాతర ఘనంగా నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు. ఆలయ అభివృద్ది కోసం కృషి చేస్తానాని ఎమ్మెల్యే చెప్పారు. మల్లన్న ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. తనవంతు ఆలయ అభివృద్ది కోసం కృషి చేస్తానని కార్పొరేటర్‌ శ్రీనివా్‌సరెడ్డి మల్లన్న చెప్పారు. సర్పంచ్‌ సతీ్‌షయాదవ్‌, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 07:19 AM