Share News

రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి మృతి

ABN , Publish Date - Feb 02 , 2024 | 11:48 PM

రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వం ఉపాధ్యాయుడు మృతిచెందిన ఘటన మహేశ్వరం పోలీసుస్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి మృతి

మహేశ్వరం, ఫిబ్రవరి 2 : రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వం ఉపాధ్యాయుడు మృతిచెందిన ఘటన మహేశ్వరం పోలీసుస్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీశైలం-హైదరాబాద్‌ ప్రధాన రహదారి బీటీఆర్‌ పార్కు ప్రధాన మార్గం వద్ద ఎదురెదురుగా వస్తున్న మినీ డీసీఎం, మారుతీ కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నాగర్‌కర్నూల్‌ జిల్లా తెల్కపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాధవరం వెంకట్‌రావ్‌(49) అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయన కారులో హైదరాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవిందర్‌ తెలిపారు.

Updated Date - Feb 02 , 2024 | 11:48 PM