ఫెన్సింగ్ రాతి కడీలు తొలగించిన ముగ్గురిపై కేసు నమోదు
ABN , Publish Date - Mar 28 , 2024 | 11:57 PM
భూమి చుట్టూ ఫెన్సింగ్ రాతి కడీలు తొలగించిన ముగ్గురిపై మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
కులకచర్ల, మార్చి 28: భూమి చుట్టూ ఫెన్సింగ్ రాతి కడీలు తొలగించిన ముగ్గురిపై మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. చౌడాపూర్ మండలం కిష్టంపల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్యకు మరికల్ గ్రామశివారులో సర్వే నెం.444లో ఎకరం భూమి ఉంది. భూమి చుట్టూ ఫెన్సింగ్ రాతి కడీలను ఏర్పాటుచేశాడు. కాగా ఈనెల 26వ తేదీన అదే గ్రామానికి చెందిన కృష్ణయ్య, చెన్నయ్య, వెంకటయ్యలు అక్రమంగా పొలంలోకి చొరబడి పొలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ రాతి కడిలను ధ్వంసం చేశారు. కృష్ణయ్య వెళ్లి అడగగా దుర్భాషలాడుతూ చంపేస్తామని బెదిరించారు. బాధితుడు కిష్టంపల్లి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు పొలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ రాతి కడీలను తొలగించడంతో పాటు కేసు నమోదు చేసినట్లు నవాబుపేట పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు.