Share News

పేకాడుతున్న ఐదుగురిపై కేసు నమోదు

ABN , Publish Date - Feb 15 , 2024 | 11:48 PM

మండల కేంద్రం శివారులో గురువారం ఐదుగురు వ్యక్తులు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు.

పేకాడుతున్న ఐదుగురిపై కేసు నమోదు

మోమిన్‌పేట్‌, ఫిబ్రవరి 15: మండల కేంద్రం శివారులో గురువారం ఐదుగురు వ్యక్తులు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. ఎస్‌ఐ అరవింద్‌ తెలిపిన వివరాల మేరకు.. పేకాడుతున్నారనే సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా ఐదుగురు పట్టుబడినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.5810 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.

Updated Date - Feb 15 , 2024 | 11:48 PM