అక్రమంగా తరలిస్తున్న 25 ఆవు దూడలు స్వాధీనం
ABN , Publish Date - May 19 , 2024 | 11:52 PM
ఏపీలోని కాకినాడ జిల్లా తుని నుంచి హైదరాబాద్లోని జియగూడకు అక్రమంగా తరలిస్తున్న 25 ఆవుదూడలను శనివారం రాత్రి పట్టుకున్నట్లు ఎస్సై గోపాల్ తెలిపారు.
![అక్రమంగా తరలిస్తున్న 25 ఆవు దూడలు స్వాధీనం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
యాచారం, మే 19 : ఏపీలోని కాకినాడ జిల్లా తుని నుంచి హైదరాబాద్లోని జియగూడకు అక్రమంగా తరలిస్తున్న 25 ఆవుదూడలను శనివారం రాత్రి పట్టుకున్నట్లు ఎస్సై గోపాల్ తెలిపారు. బొలోరో వాహనంలో ఇస్రాపు శ్రీను అనే వ్యక్తి వాటిని తరలిస్తున్నాడని తెలిపారు. యాచారం మండల కేంద్రంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆవుదూడలను స్వాధీనం చేసుకుని గోశాలకు తరలించామని చెప్పారు.