Share News

16 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం సీజ్‌

ABN , Publish Date - Feb 11 , 2024 | 11:45 PM

శంషాబాద్‌ మండలంలోని చిన్న గోల్కొండ గ్రామం నుంచి శంషాబాద్‌కు తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని ఆదివారం ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు.

16 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం సీజ్‌

శంషాబాద్‌, ఫిబ్రవరి 11 : శంషాబాద్‌ మండలంలోని చిన్న గోల్కొండ గ్రామం నుంచి శంషాబాద్‌కు తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని ఆదివారం ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. 16 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి సేకరించిన రేషన్‌ బియ్యాన్ని దొంగచాటుగా తరలిస్తున్నట్టు ఎ స్వోటీ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు వారు దాడి నిర్వహించి బి య్యాన్ని పట్టుకున్నారు. బియ్య తరలిస్తున్న ఇద్దరు నిందితులను, పట్టుబడిన బియ్యాన్ని శంషాబాద్‌ రూరల్‌ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - Feb 11 , 2024 | 11:45 PM