జీఎమ్మార్ ఎరీనాలో నేడు 10కే మారథాన్
ABN , Publish Date - Aug 10 , 2024 | 12:07 AM
శంషాబాద్ విమానాశ్రయంలోని జీఎమ్మార్ ఎరీనాలో నేడు 10కే మారథాన్ నిర్వహించనున్నట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హాజరుకానున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
శంషాబాద్ రూరల్, ఆగస్టు 9 : శంషాబాద్ విమానాశ్రయంలోని జీఎమ్మార్ ఎరీనాలో నేడు 10కే మారథాన్ నిర్వహించనున్నట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెకండ్ ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్-2024 కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం మారథాన్ నిర్వహిస్తున్నామని, కార్యక్రమానికి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.