Share News

Siddipet: సహజీవనం కేసు.. ఎస్ఐ, కానిస్టేబుల్‌పై వేటు

ABN , Publish Date - May 22 , 2024 | 09:32 PM

సహజీవనం వ్యవహారంలో సిద్దిపేట కమిషనరేట్ కు చెందిన కొమురెల్లి ఎస్. ఐ గా విధులు నిర్వహిస్తున్న నాగరాజుతో పాటు, కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ పీఎస్ కానిస్టేబుల్ పి. శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీపీ రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Siddipet: సహజీవనం కేసు.. ఎస్ఐ, కానిస్టేబుల్‌పై వేటు

సిద్దిపేట: సహజీవనం వ్యవహారంలో సిద్దిపేట కమిషనరేట్ కు చెందిన కొమురెల్లి ఎస్. ఐ గా విధులు నిర్వహిస్తున్న నాగరాజుతో పాటు, కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ పీఎస్ కానిస్టేబుల్ పి. శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీపీ రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురెల్లి ఎస్.ఐ నాగరాజు, కానిస్టేబుల్ శ్రీనివాస్ ఇరువురు ఇతరులతో సహజీవనం చేస్తున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో నాగరాజు భార్య తన పిల్లల కోసం కొమురెల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఘటనపై సిద్దిపేట పోలీస్ కమిషనర్ విచారణ జరిపి ఇచ్చిన నివేదికలో ఆరోపణలు నిర్ధారణ కావడంతో వారిద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్లు మల్టీ జోన్ 1 ఐజీపీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - May 22 , 2024 | 09:32 PM