Share News

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి

ABN , Publish Date - Mar 18 , 2024 | 11:58 PM

జిల్లాలో ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ట్రైనీ ఐపీఎస్‌ రాజే్‌షమీనా అన్నారు.

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి
బండమీదిచందుపట్లలో కవాతు నిర్వహిస్తున్న సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బంది, పోలీసులు

చివ్వెంల, మార్చి 18: జిల్లాలో ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ట్రైనీ ఐపీఎస్‌ రాజే్‌షమీనా అన్నారు. సోమవారం మండల కేంద్రంతో పాటు బండమీదిచందుపట్ల గ్రామాల్లో సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బంది, పోలీస్‌ సిబ్బందితో కలిసి కవాతు నిర్వహించి, మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పటిష్ఠ బందోబస్తుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో సీఐ వై.సురేందర్‌రెడ్డి, ఎస్‌.వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2024 | 11:58 PM