‘వక్ఫ్’ భూములను పరిరక్షించాలి
ABN , Publish Date - Feb 20 , 2024 | 12:03 AM
చౌటుప్పల్ పట్టణంలోని సర్వే నంబరు 356 లోని వక్ఫ్ బోర్డు భూమిని పరిరక్షించాలని వక్ఫ్ బోర్డు భూ ముల పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ ఎంఏ.ఇక్బాల్ డిమాండ్ చేశారు.
![‘వక్ఫ్’ భూములను పరిరక్షించాలి](https://media.andhrajyothy.com/media/2024/20240215/10_0172326d02.jpg)
చౌటుప్పల్ టౌన, పిబ్రవరి 19: చౌటుప్పల్ పట్టణంలోని సర్వే నంబరు 356 లోని వక్ఫ్ బోర్డు భూమిని పరిరక్షించాలని వక్ఫ్ బోర్డు భూ ముల పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ ఎంఏ.ఇక్బాల్ డిమాండ్ చేశారు. స్థానిక ఏమ్మార్ షాదీఖానలో సోమవారం వక్ఫ్ బోర్డు భూముల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంఎ ఇక్బాల్ మాట్లాడుతూ వక్ఫ్బోర్డు భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో మునిసిపల్ కౌన్సిలర్ ఎండి.బాబాషరీప్, వివిధ పార్టీల నాయకులు ఎండి.హన్నూబాయి, బండా రు నర్సింహ, ఎండి.పాషా, ఎండి.ఖలీల్, రహమాన, లతీఫ్, గౌస్ పాల్గొన్నారు.