Share News

అసంపూర్తి పనులను పూర్తి చేయాలి

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:23 AM

అసంపూర్తి పనులను త్వరగా పూర్తిచేయాలని జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి ఆదేశించారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సబ్‌కా యోజ న, సబ్‌కా వికాస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

అసంపూర్తి పనులను పూర్తి చేయాలి

జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి

భువనగిరి రూరల్‌, ఫిబ్రవరి 16: అసంపూర్తి పనులను త్వరగా పూర్తిచేయాలని జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి ఆదేశించారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సబ్‌కా యోజ న, సబ్‌కా వికాస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిర్మాణాల్లో జాప్యం జరుగుతుండడంతో ప్రజలకు ప్ర యోజనం చేకూరడం లేదన్నారు. సంబంధిత అధికారు లు క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని గుర్తిం చి వెంటనే నివేదిక అందించాలన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ సమీపిస్తున్న దృష్ట్యా పనులన్నింటినీ పూ ర్తి చేయాలన్నారు. సమావేశంలో జడ్పీవై్‌సచైర్మన్‌ ధనావత్‌ బీకూనాయక్‌, సీఈవో ఎన్‌.శోభారాణి, డిప్యూటీ సీఈవో విష్ణువర్థన్‌రెడ్డి, జడ్పీటీసీలు చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, సుబ్బూరు బీరుమల్లయ్య, నరేందర్‌గుప్త, అనురాధ, పద్మ, పీఆర్‌ ఈఈ వెంకటేశ్వర్లు, అదనపు డీఆర్‌డీవో సురేష్‌, ఐసీడీఎస్‌ పీడీ కృష్ణవేణి, డీఏ వో కె.అనురాధ, హార్టికల్చర్‌ అధికారి అన్నపూర్ణ, డీఎంహెచ్‌వో డాక్టర్‌ పరిపూర్ణాచారి, జడ్పీ సూపరింటెండెంట్‌ కె.రమే్‌షరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 12:23 AM