ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి
ABN , Publish Date - May 23 , 2024 | 12:16 AM
ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టేందు కు ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలని ఎస్ఎ్ఫఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూ ర్తి అన్నారు. బుధవారం భువనగిరిలో నిర్వహించి న ఎస్ఎ్ఫఐ సమావేశం లో ఆయన మాట్లాడారు.
![ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి](https://media.andhrajyothy.com/media/2024/20240511/22_Town_bng_2_82e74b3d89.jpg)
భువనగిరి టౌన్, మే 22 : ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టేందు కు ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలని ఎస్ఎ్ఫఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూ ర్తి అన్నారు. బుధవారం భువనగిరిలో నిర్వహించి న ఎస్ఎ్ఫఐ సమావేశం లో ఆయన మాట్లాడారు. అధిక ఫీజులు, డొనేషన్లు, విద్యా సామాగ్రి విక్రయాలతో యాజమాన్యాలు తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నాయన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనకాడుతుండటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. పాలకులు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ విద్యావ్యవస్థను కార్పొరేట్ విద్యాసంస్థలకు అప్పగిస్తున్నాయన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని, 24, 25వ తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో ఎస్ఎ్ఫఐ ఉమ్మడి రాష్ట్ర మాజీ అఽధ్యక్షుడు కల్లూరి మల్లేశం, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చింతల శివ, లావుడ్య రాజు, వేముల నాగరాజు, ఈర్ల రాహుల్, కాసుల నరేష్, బుగ్గ ఉదయ్ పాల్గొన్నారు.