Share News

అంగనవాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - Jan 06 , 2024 | 12:25 AM

అంగనవాడీ ఉద్యోగుల సమ్మె కాలపు వేతనం ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం నూతన ప్రభుత్వాన్ని కోరారు.

అంగనవాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
రామన్నపేట: సమావేశంలో మాట్లాడుతున్న సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం

రామన్నపేట, జనవరి 5: అంగనవాడీ ఉద్యోగుల సమ్మె కాలపు వేతనం ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం నూతన ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం రోజున సీఐటీయూ మండల సమన్వయ కమిటీ సమావేశం మండల కన్వీనర్‌ గొరిగె సోములు అధ్యక్షతన జరిగన సమావేశంలో ఆయన హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందని అందుకే కార్మికులు తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు. కార్మికుల సంక్షేమం గురించి నూతన ప్రబుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ గొరిగె సోములు, గ్రామ పంచాయతీ యూనియన జిల్లా అధ్యక్షుడు బందెల భిక్షం, అంగనవాడీ యూనియన మండల అధ్యక్ష కార్యదర్శులు లలిత, మంజు ల, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు వంగాల మారయ్య, నాయకులు నకిరెకంటి రాము, దండిగ అంజయ్య, కంబాలపల్లి రాములు, సువర్ణ, కంకల నర్సింహ పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2024 | 12:25 AM