చెంచులు పథకాలను వినియోగించుకోవాలి
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:28 AM
చెంచులు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని గిరిజన సంక్షేమశాఖ అధికారి రాజ్కుమార్ అన్నారు. గురువారం మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో తిమ్మాపురం, గన్నేర్లపల్లి చెంచులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు.
![చెంచులు పథకాలను వినియోగించుకోవాలి](https://media.andhrajyothy.com/media/2023/20231205/11dvkp8_b37a3c6a28.jpg)
జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి రాజ్కుమార్
నేరేడుగొమ్ము, జనవరి 11: చెంచులు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని గిరిజన సంక్షేమశాఖ అధికారి రాజ్కుమార్ అన్నారు. గురువారం మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో తిమ్మాపురం, గన్నేర్లపల్లి చెంచులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం అందించే ప్రతీ పథకం గిరిజనులకు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు ఆధార్కార్డు పొందలేని చెంచుల కోసం ఆధార్కార్డులను అందించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. దీన్ని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బాలు, నేరేడుగొమ్ము, చందంపేట ఎంపీడీవోలు ఝాన్సీ లక్ష్మీబాయి, రాములునాయక్, వైస్ఎంపీపీ ఆరేకంటి ముత్యాలమ్మ, ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు లింగయ్య, పాల్గొన్నారు.