మైనర్పై లైంగికదాడి
ABN , Publish Date - Mar 09 , 2024 | 11:47 PM
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో ఓ మైనర్పై లైంగికదాడి జరిగింది.
![మైనర్పై లైంగికదాడి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
నేరేడుచర్ల, మార్చి 9: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో ఓ మైనర్పై లైంగికదాడి జరిగింది. ఎస్ఐ రవీందర్నాయక్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం నేరేడుచర్ల మండలానికి చెందిన 14ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన షేక్ సుభాని(45) అనే వ్యక్తి లైంగిక దాడి చేసి పరారయ్యాడు. బాధితురాలి తల్లి వరంగల్ జిల్లా చెందిన ఓ వ్యక్తితో 15 ఏళ్ల క్రితం వివాహం చేసుకుంది. రెండేళ్లకి కుమార్తె పుట్టింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుంది. తర్వాత కుమార్తెను తీసుకొని బతుకుదెరువు కోసం కోదాడకు వచ్చింది. కోదాడలో నివాసముంటున్న ఆమెకు నేరేడుచర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ లారీడ్రైవర్ పరిచయమయ్యాడు. అతడిని వివాహం చేసుకుంది. ఏడాదిగా అద్దె ఇంట్లో కుమార్తె, భర్తతో కలిసి ఉంటోంది. వీరు ఉండే పక్క ఇంట్లోనే పెయింటింగ్ పని చేసే షేక్ సుభాని నివాసముంటున్నాడు. సుభాని కొంతకాలంగా భార్యతో విభేదించి దూరంగా ఉంటున్నాడు. నేరేడుచర్లలో మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. బాధితురాలు, షేక్ సుభాని ఇరువురు కుటుంబాలు ఒకే ఇంట్లో పక్కపక్క గదుల్లో అద్దెకు ఉంటున్నారు. షేక్ సుభానితో సహజీవనం చేస్తున్న మహిళతో శుక్రవారం రాత్రి ఘర్షణ జరగడంతో ఆమె శుక్రవారం రాత్రి సదరు బాలిక ఇంట్లో పడుకుంది. సుభాని మాత్రం అద్దె ఇంట్లోనే ఉన్నాడు. సుభానితో సహజీవనం చేస్తున్న మహిళకు ఇదే వీధిలో సొంత ఇల్లు ఉంది. ఉదయం బాలిక, తన తల్లితో కలిసి సుభాని సహజీవనం చేస్తున్న మహిళ ఇంటికి శనివారం ఉదయం వెళ్లారు. ఇంటికి వెళ్లి అన్నం పెట్టుకు రమ్మని తల్లి చెప్పడంతో బాలిక ఒంటరిగా వారు ఉంటున్న అద్దె ఇంటికి వచ్చింది. అది గమనించిన సుభాని ఆమె ఇంట్లోకి వెళ్లి బాలికపై బలవంతంగా లైంగిక దాడి చేసి గోడదూకి పారిపోయాడు. బాలిక ఈ విషయాన్ని తల్లికి చెప్పడంతో వారు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. సంఘటనా ప్రాంతాన్ని హుజూర్నగర్ సీఐ చలమంద రాజు పరిశీలించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.