Share News

శాస్త్రోక్తంగా లక్ష్మీనరసింహుడి కల్యాణం

ABN , Publish Date - May 30 , 2024 | 12:14 AM

మట్టపల్లి లక్ష్మీనరసింహుడి క్షేత్రంలో స్వామివారి నిత్య కల్యాణాన్ని వేదపండితు లు బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

శాస్త్రోక్తంగా లక్ష్మీనరసింహుడి కల్యాణం

మఠంపల్లి, మే 29: మట్టపల్లి లక్ష్మీనరసింహుడి క్షేత్రంలో స్వామివారి నిత్య కల్యాణాన్ని వేదపండితు లు బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయం లో తొలుత విశ్వక్సేన పూజ, పుణ్యాహావాచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్యప్రాసన అనంత రం మాంగళ్యధారణ, తలంబ్రాల తంతును వైభవం గా నిర్వహించారు. అనంతరం నీరాజన మంత్రపుష్పాలతో మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదా లు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు చెన్నూరి విజయ్‌కుమార్‌, మట్టపల్లిరావు, ఈవో సిరికొండ నవీన్‌, ఆలయ అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, కృష్ణామాచార్యులు, రామాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, నరసింహమూర్తి, లక్ష్మీనరసింహమూర్తి, సీతారామశాస్ర్తీ, శేషగిరిరావు, రాజష్‌, రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2024 | 12:14 AM