మునిసిపల్ తైబజార్ వేలం వాయిదా
ABN , Publish Date - Mar 27 , 2024 | 11:29 PM
భువనగిరి మున్సిపల్ తై బజార్ వేలం పాట ఈ నెల 29న నిర్వహించాల్సి ఉండగా తాత్కాలికంగా వాయిదా వేసినట్టు కమిషనర్ పి.రామాంజుల్రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
![మునిసిపల్ తైబజార్ వేలం వాయిదా](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
భువనగిరి టౌన, మార్చి 27: భువనగిరి మున్సిపల్ తై బజార్ వేలం పాట ఈ నెల 29న నిర్వహించాల్సి ఉండగా తాత్కాలికంగా వాయిదా వేసినట్టు కమిషనర్ పి.రామాంజుల్రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత సంవత్సరం తై బజార్ వసూలలో నష్టం జరిగినందున తననే రెన్యువల్ చేయాలంటూ అప్పటి కాంట్రాక్టర్ హైకోర్టును ఆశ్రయించాడు. ఫలితంగా హైకోర్టు ఈ నెల 22న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులతో వేలం పాటను వాయిదా వేసినట్టు కమిషనర్ తెలిపారు. కాగా ఈ మునిసిపాలిటీకి ఆదాయం సమకూరే తై బజార్ వేలంపాట నిర్వహణకు అనుమతించాలంటూ మున్సిపాలిటీ కూడా హైకోర్టును ఆశ్రయిస్తున్నట్టు తెలిసింది.