Share News

రామన్నపేట ఎంపీపీపై అవిశ్వాసం

ABN , Publish Date - Jan 05 , 2024 | 01:02 AM

రామన్నపేట ఎంపీపీ కన్నెబోయిన జ్యోతిపై అవిశ్వాసం ప్రకటిస్తూ 10మంది ఎంపీటీసీ సభ్యులు గురువారం చౌటుప్పల్‌ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.

రామన్నపేట ఎంపీపీపై అవిశ్వాసం
ఆర్డీవోకు వినతిపత్రం అందజేస్తున్న ఎంపీటీసీలు

ఆర్డీవోకు వినతిపత్రం అందజేసిన 10మంది ఎంపీటీసీలు

రామన్నపేట, జనవరి 4: రామన్నపేట ఎంపీపీ కన్నెబోయిన జ్యోతిపై అవిశ్వాసం ప్రకటిస్తూ 10మంది ఎంపీటీసీ సభ్యులు గురువారం చౌటుప్పల్‌ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలు మాట్లాడుతూ ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఎంపీటీసీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా, అధికారాన్ని అడ్డం పెటుకుని నిధులు దుర్వినియోగం చేస్తూ, అవినీతికి పాల్పడుతూ ఇష్టానుసారంగా వ్యవహరుస్తున్నారని పేర్కొన్నారు. మండలం పరిషత తీర్మానాలకు వ్యతిరేకంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. 10మంది ఎంపీటీసీలం ఆమెకు మద్దతు ఉపసంహరిస్తున్నామని, తక్షణమే ఆమెను ఎంపీపీ పదవి నుంచి తప్పించాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో వైస్‌ ఎంపీపీ నాగటి ఉపేందర్‌, ఎంపీటీసీలు పూస బాలమణి, బడుగు రమేష్‌, ఎర్రోళ్ల లక్ష్మమ్మ, తిమ్మాపురం మహేందర్‌రెడ్డి, ఎండి.రేహన, ఏనుగు పుష్పమ్మ, గోగు పద్మ, హర్షిణి పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 01:02 AM