Share News

ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Feb 15 , 2024 | 11:59 PM

దివ్యాంగుల కు చేయూతనిచ్చేందుకు అందజేస్తున్న సహాయ ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీచైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి అన్నారు.

ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలి

జడ్పీచైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి

భువనగిరి రూరల్‌, ఫిబ్రవరి 15: దివ్యాంగుల కు చేయూతనిచ్చేందుకు అందజేస్తున్న సహాయ ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీచైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి అన్నారు. మహిళా, శి శు,దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా ఆలింకో కంపెనీ ఆధ్వర్యంలో గురువారం భువనగిరి శివారులోని రాయిగిరిలో ఉపకరణాల పంపిణీ కా ర్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 603 సహా య ఉపకరణాలను మంజూరు చేసిందని చెప్పారు. కార్యక్రమంలో ఆలింకో ప్రతినిధి నీతుదూబే, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, జి.శశికళ, జడ్పీటీసీలు సుబ్బూరు బీరుమల్లయ్య, తోటకూర అనురాధ, ఎం పీపీలు నరాల నిర్మల, సీహెచ్‌ సుధీర్‌రెడ్డి, అలింకో సంస్థ పీవో రవిశంకర్‌, దివ్యాంగుల కమిటీ ప్రతినిధులు నర్సింహులు, ప్రకాశ్‌, అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 11:59 PM