తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలి
ABN , Publish Date - Feb 17 , 2024 | 12:25 AM
తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించి రైతులు ఆర్థిక పరిపుష్టి సాధించాలని ఏరువాక జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ బి.అనిల్కుమార్ అన్నారు.
![తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలి](https://media.andhrajyothy.com/media/2024/20240215/16_Rural_bng_4_511119f8a3.jpg)
భువనగిరి రూరల్, ఫిబ్రవరి 16: తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించి రైతులు ఆర్థిక పరిపుష్టి సాధించాలని ఏరువాక జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ బి.అనిల్కుమార్ అన్నారు. మండలంలోని చందుపట్లలో రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యాసంగి విశ్లేషణ, వ్యూహపటం, సమగ్ర వరి యాజమాన్య శిక్షణ, వరిలో నానో యూరియా, నానో డీఏపీ యొక్క ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ వేత్త కె.మమత, ఏఈవో మౌనిక, వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఎస్.ఔశ్మిత, పి.అనూష, వి.శరణ్య, యూ.సాత్వికారెడ్డి ఉన్నారు.