Share News

వైభవంగా వేణుగోపాలస్వామి గ్రామోత్సవం

ABN , Publish Date - Feb 28 , 2024 | 12:06 AM

మండలంలోని గోపలాయపల్లిలోని శ్రీవారిజాల వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

వైభవంగా వేణుగోపాలస్వామి గ్రామోత్సవం
పురవీధుల్లో స్వామి వారి ఊరేగింపు

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 27 : మండలంలోని గోపలాయపల్లిలోని శ్రీవారిజాల వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై అధిష్టించి మంగళవాయిద్యాల నడుమ గోపలాయపల్లి పురవీధుల్లో ఊరేగించారు. వాహనసేవతో తమ ఇంటి ముంగిటికి వచ్చిన స్వామి అమ్మవార్ల రథానికి గ్రామస్థులు నీళ్లు ఆరబోస్తూ మంగళహారతులను పట్టారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన కోమటిరెడ్డి మోహనరెడ్డి, మాజీ సర్పంచ గోసుల భద్రాచలం, యాట సైదులు, నర్రా నర్సిరెడ్డి, గుత్తా కృష్ణారెడ్డి, దార యాదయ్య, గోవర్ధన, మచ్చ రాజు, బెల్లి గణేష్‌, లచం రాఘవేందర్‌, అల్లె శ్రీహరి, గాలి ఆంజనేయులు, మచ్చ వేణు, జాల లింగయ్య, మచ్చ కృష్ణయ్య, దేశగాని మల్లేష్‌, పగిడిమర్రి వెంకన్న, గోసుల సందీప్‌, ప్రశాంత, సారయ్య, శ్రవణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 12:06 AM