విద్యుత సమస్యను పరిష్కరించాలి: సీపీఎం
ABN , Publish Date - May 29 , 2024 | 12:12 AM
మండలంలోని అనాజీపురం గ్రామంలో విద్యుత లో వోల్టేజీ, వేలాడుతున్న విద్యుత తీగలతో విద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని సీపీఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, నాయకులు ఎదునూరి మల్లేశం, అబ్దుల్లాపూర్ వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
![విద్యుత సమస్యను పరిష్కరించాలి: సీపీఎం](https://media.andhrajyothy.com/media/2024/20240511/28_Rural_bng_4_8222291ead.jpg)
భువనగిరి రూరల్ మే 28: మండలంలోని అనాజీపురం గ్రామంలో విద్యుత లో వోల్టేజీ, వేలాడుతున్న విద్యుత తీగలతో విద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని సీపీఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, నాయకులు ఎదునూరి మల్లేశం, అబ్దుల్లాపూర్ వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ట్రాన్సకో డీఈ బి.మల్లిఖార్జునగౌడ్కు వినతిపత్రం అందజేశారు. చిన్నపాటి వర్షానికి, ఈదురుగాలులకు వెంటనే విద్యుత సరఫరా నిలిచిపోతోందని, గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారని, లోవోల్టేజీతో విద్యుత ఉపకరణాలైన టీవీలు, ఫ్రిజ్లు, లైట్లు కాలిపోతున్నాయని పేర్కొన్నారు. విద్యుత సమస్యలను పరిష్కరించాలని కోరారు.