Share News

శాంతియుత వాతావరణంలో ఎన్నికలు: ఏసీపీ

ABN , Publish Date - Apr 24 , 2024 | 12:31 AM

శాంతియుత వాతావరణంలో అందరం కలిసి పార్లమెంటు ఎన్నికలను నిర్వహించుకుందామని చౌటుప్పల్‌ ఏసీపీ మధుసూధనరెడ్డి తెలిపారు.

శాంతియుత వాతావరణంలో ఎన్నికలు: ఏసీపీ

వలిగొండ, ఏప్రిల్‌ 23: శాంతియుత వాతావరణంలో అందరం కలిసి పార్లమెంటు ఎన్నికలను నిర్వహించుకుందామని చౌటుప్పల్‌ ఏసీపీ మధుసూధనరెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ బెల్టు షాపులపై కేసులను నమోదు చేశామని పలువురుని ముందస్తు బైడోవర్‌ చేసినట్లు ఆయన తెలిపారు. భువనగిరి అసెంబ్లీ పరిధిలో ఆరు గ్రామాలు, ఆలేరు పరిధిలో రెండు గ్రామాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామన్నారు. ఎన్నికలకు ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే చట్టా ప్రకారం చర్యలు తప్పవన్నారు. సురక్షితమైన స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వాహణకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో రామన్నపేట సిఐ వెంకటేశ్వర్లు, వలిగొండ ఎస్‌ఐ మహేందర్‌, పోలీస్‌ సిబ్బందులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 07:44 AM