సీపీఎం రోడ్షోను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Apr 18 , 2024 | 12:36 AM
సీపీఎం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి ఎండి.జహంగీర్ నామినేషన సందర్భంగా భువనగిరి జిల్లా కేంద్రంలో ఈ నెల 19న నిర్వహిస్తున్న రోడ్ షో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు వనం ఉపేందర్ పిలుపునిచ్చారు.
జిల్లా కమిటీ సభ్యుడు వనం ఉపేందర్
రామన్నపేట, ఏప్రిల్ 17: సీపీఎం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి ఎండి.జహంగీర్ నామినేషన సందర్భంగా భువనగిరి జిల్లా కేంద్రంలో ఈ నెల 19న నిర్వహిస్తున్న రోడ్ షో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు వనం ఉపేందర్ పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని కక్కిరేణి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి మాట్లాడారు. సీపీఎం అభ్యర్థి ఎండి.జహంగీర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి, పార్లమెంట్కు పంపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు వేముల సైదులు, శాఖ కార్యదర్శి కన్నెబోయిన యాదయ్య, ఎనపిఆర్డి జిల్లా నాయకులు పిట్ట శ్రీనివా్సరెడ్డి, కన్నెబోయిన మంగమ్మ, మంజుల, రాములు పాల్గొన్నారు.