ఉపాధి హామీ పథకాన్ని సాధించిన ఘనత సీపీఎందే
ABN , Publish Date - Apr 19 , 2024 | 12:11 AM
ఉపాధి హమీ చట్టాన్ని పోరాడి తీసుకువచ్చిన సీపీఎంను బలపరచాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పాలడుగు భాస్కర్ ఉపాధి కూలీలను కోరారు.
భువనగిరి రూరల్, ఏప్రిల్ 18: ఉపాధి హమీ చట్టాన్ని పోరాడి తీసుకువచ్చిన సీపీఎంను బలపరచాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పాలడుగు భాస్కర్ ఉపాధి కూలీలను కోరారు. గురువారం మండలంలోని పెంచికల్పహాడ్, అనాజిపురం గ్రామాల్లో సీపీఎం పార్లమెంట్ అభ్యర్థి ఎండి.జహంగీర్ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రభుత్వం రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కొండమడుగు నరసింహ, జె.వెంకటేష్, దాసరి పాండు, దయ్యాల నరసింహ, ఎదునూరి మల్లేశం, అబ్దూల్లాపురం వెంకటేష్, భిక్షపతి, బాలయ్య, స్వామి, బాలరాజ్ ఉన్నారు.