వచ్చే ఎన్నికల్లో కాంగ్రె్సకు బుద్ధిచెప్పాలి
ABN , Publish Date - Mar 22 , 2024 | 12:09 AM
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రె్స కు మహిళలు బుద్ధి చెప్పాలని బీజే పీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బుల్లెట్ మాధురి చంద్ర పిలుపునిచ్చారు.
![వచ్చే ఎన్నికల్లో కాంగ్రె్సకు బుద్ధిచెప్పాలి](https://media.andhrajyothy.com/media/2024/20240313/21_Town_bng_8_3cccf680ea.jpg)
బీజేపీ జిల్లా అధ్యక్షుడు భాస్కర్
భువనగిరి టౌన్, మార్చి 21: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రె్స కు మహిళలు బుద్ధి చెప్పాలని బీజే పీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బుల్లెట్ మాధురి చంద్ర పిలుపునిచ్చారు. గురువారం భువనగిరిలో జరిగిన మోర్చా సమావేశంలో వా రు మాట్లాడారు. దేశంలో మహిళలను గౌరవిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. మహిళల సామాజిక, ఆర్థిక భద్రతకు ప్రధాని నరేంద్ర మోదీ అగ్ర ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. మహిళా వికాసం కోసం మరోమారు ప్రధాని మోదీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా జిల్లా కమిటీని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా కుమ్మరిండ్ల లక్ష్మీ, లక్కాకుల మాధవి, జక్కుల శ్రీవాణి, రంగా రేఖ, నూనె మాధవి, ప్రధాన కార్యదర్శిగా ముగిరెడ్డి శ్రావణి, సహాయ కార్యదర్శిగా అన్నం శోభ, సోషల్ మీడియా జిల్లా మహిళా కన్వీనర్గా వెంపటి రమ్యను ప్రకటించి నియామక పత్రాలు అందజేశారు. అలాగే బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధిగా మంగు నరసింహారావును నియమించినట్టు యు వ మోర్చా జిల్లా అధ్యక్షుడు పట్నం కపిల్ తెలిపా రు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.