కాంగ్రెస్ పథకాలతో ప్రజలకు లబ్ధి
ABN , Publish Date - Apr 18 , 2024 | 12:25 AM
భువనగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించడం తథ్యమని కాంగ్రెస్ పార్లమెంట్ ఇనచార్జ్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు.
చౌటుప్పల్ టౌన/ చౌటుప్పల్ రూరల్, ఏప్రిల్ 17: భువనగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించడం తథ్యమని కాంగ్రెస్ పార్లమెంట్ ఇనచార్జ్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. చౌటుప్పల్లోని తన క్యాంప్ కార్యాలయంలో బుధవారం కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సమక్షంలో మండలంలోని మల్కాపురం గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రె్సలో చేరారు. కాంగ్రె్సలో చేరిన వారిలో ఆందోళ్ మైసమ్మ దేవస్థానం మాజీ చైర్మన సిద్దిపేట శేఖర్రెడ్డి, రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన సుంకరి సత్యనారాయణ, రెడ్డి సంఘం అధ్యక్షుడు తుంగ భూపాల్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు దౌడి వెంకటేశ, గుండ్ల అనిల్, సుంకరి రమేష్, ఎం.శంకరయ్య, ఇ.హరిప్రసాద్ ఉన్నారు. కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్, బ్లాక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి, దేవేందర్ పాల్గొన్నారు.