చాంద్ ముబారక్
ABN , Publish Date - Mar 12 , 2024 | 12:00 AM
ముస్లిం లు పవిత్రంగా భావించే రంజాన మాసం ప్రారంభమైంది. సోమవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కన్పించడంతో మంగళవారం ఉదయం నుంచే కఠిన ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి.
![చాంద్ ముబారక్](https://media.andhrajyothy.com/media/2024/20240306/madana_misad_1_5a9b568786.jpg)
నేటి నుంచి రంజాన మాసం
ప్రత్యేక ప్రార్థనలకు సిద్ధమైన మసీదులు
నల్లగొండ కల్చర ల్, మార్చి 11: ముస్లిం లు పవిత్రంగా భావించే రంజాన మాసం ప్రారంభమైంది. సోమవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కన్పించడంతో మంగళవారం ఉదయం నుంచే కఠిన ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు ముస్లింలు ఉపవాస దీక్ష పాటించనున్నా రు. రంజాన మాసం ప్రారంభమవడంతో ప్రత్యేక ప్రార్థనలకు మసీదులు ముస్తాబయ్యా యి. నెల రోజుల పాటు ఖురాన పఠనాలు, నమాజ్, సహార్, ఇప్తార్, తరావీ ప్రార్థనలతో మసీదుల్లో సందడి నెలకొననుంది. అదేవిధంగా రంజాన మాస ప్రత్యేక వంటకాలైన హరీస్, హలీమ్ దుకాణాలు పట్టణంలో ఏర్పాటు చేశారు.