కారు ఆటో ఢీ, మహిళ మృతి
ABN , Publish Date - Feb 25 , 2024 | 12:12 AM
ఆటోను అతివేగంతో కారు ఢీకొట్టిన ఘటనలో మహిళ మృతి చెందగా, నలుగురికి త్రీవగాయాలయ్యాయి.
![కారు ఆటో ఢీ, మహిళ మృతి](https://media.andhrajyothy.com/media/2024/20240224/24arp1_a45a38a5e8.jpg)
అర్వపల్లి, ఫిబ్రవరి 24: ఆటోను అతివేగంతో కారు ఢీకొట్టిన ఘటనలో మహిళ మృతి చెందగా, నలుగురికి త్రీవగాయాలయ్యాయి. ఎస్ఐ మహేందర్నాథ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శనివారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం తిమ్మాపురం నుంచి మాదారం గ్రామానికి ఆటోలో ఏడుగురు బయలుదేరారు. గోపాల్రెడ్డినగర్ సమీపంలోకి రాగానే అర్వపల్లి నుంచి సూర్యాపేటకు వెళ్తున్న కారు అతివేగంగా ఆటోను ఢీకొట్టింది.ఈ ఘటనలో కోడూరు గ్రామానికి చెందిన గంట ఎల్లమ్మ(40) తీవ్ర గాయాలపాలై మృతి చెందగా, ఆటో డ్రైవర్ బొడ్డు లక్ష్మణ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. బొడ్డు స్వరూప, బొడ్డు ఎల్లమ్మకు తీవ్ర గాయాలు కావడంతో 108వాహనంలో సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు.ఆటోలోని ఇద్దరు చిన్నారులకు గాయాలు కాలేదు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేందర్నాధ్ తెలిపారు.