కల్యాణోత్సవానికి పటిష్ఠ బందోబస్తు
ABN , Publish Date - May 22 , 2024 | 12:00 AM
మట్టపల్లి క్షేత్రంలో గురువారం తెల్లవారు జూమున నిర్వహించే నృసింహుడి కల్యాణోత్సవానికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు హు జూర్నగర్ సీఐ జి.చరమందరాజు అన్నారు.
![కల్యాణోత్సవానికి పటిష్ఠ బందోబస్తు](https://media.andhrajyothy.com/media/2024/20240511/21_mtpl_5_f74dca7467.jpg)
సీఐ చరమందరాజు
మఠంపల్లి, మే 21: మట్టపల్లి క్షేత్రంలో గురువారం తెల్లవారు జూమున నిర్వహించే నృసింహుడి కల్యాణోత్సవానికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు హు జూర్నగర్ సీఐ జి.చరమందరాజు అన్నారు. మంగళవారం మట్టపల్లి పార్కింగ్, క ల్యాణమండపం, క్యూలైన్లు, వీఐపీల పార్కింగ్ స్థలం, బస్సులు, వాహనాల రాకపోకలపై అధికారులు, పోలీసులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. బు ధవారం అర్ధరాత్రి తరువాత జరిగే తిరుకల్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులకు ఎ లాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయలన్నారు. వాహనాల పార్కింగ్, భక్తుల రద్దీ, వీఐపీలకు దర్శనాలు, తాగునీరు, నీడ, వసతి సౌకర్యాలు, తదితర మౌలిక వసతులు, అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంత వా తావరణంలో కల్యాణం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేంలో తహసీల్దార్ మంగారాథోడ్, ఎస్ఐ ఎం.రామాంజనేయులు, ఆలయ ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈవో సిరికొండనవీన్, పాల్గొన్నారు.