తండ్రికి తలకొరివిపెట్టిన కుమార్తె
ABN , Publish Date - Apr 18 , 2024 | 12:28 AM
కుమారులు లేకపోవడంతో కుమార్తె తండ్రికి తలకొరివి పెట్టింది.
ఆత్మకూరు(ఎం) ఏప్రిల్ 17: కుమారులు లేకపోవడంతో కుమార్తె తండ్రికి తలకొరివి పెట్టింది. మండలంలోని కప్రాయిపల్లి గ్రామంలో కొడిమాల సత్తయ్య( 55)అనే వ్యక్తి బుధవారం గుండె పోటుతో మృతిచెందాడు. అతనికి కుమారులు లేనందున కుమార్తెలే తండ్రికి తలకొరివి పెట్టారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొడిమాల సత్తయ్య రోజూ కట్టెకొట్టే పనికి కూలికి వెళ్లేవాడు. అతనికి భవాని, రమ్య అనే ఇద్దరు కుమార్తెలు ఉండగా భవానికి వివాహం చేశాడు. చిన్న కుమార్తె డిగ్రీ చదువుకుంటోంది. సత్తయ్య భార్య అనారోగ్యంతో గత ఏడాది మృతిచెందింది. రోజూ మాదిరిగానే మంగళవారం పనికి వెళ్లివచ్చిన సత్తయ్య భోజనం చేసి, ఇంటి ఎదుట మంచంలో నిద్రించాడు. చిన్న కుమార్తె గ్రామంలో ఉన్న అమ్మమ్మ ఇంట్లో నిద్రించింది. బుధవారం తెల్లవారుజామున రమ్య ఇంటికి వచ్చి తండ్రిని నిద్రలేపబోగా అతను అప్పటికే మృతిచెందాడు. సత్తయ్య గుండె పోటుతో చనిపోయినట్లు గ్రామస్థులు గుర్తించారు. సత్తయ్య దహన సంస్కారాలకు పెద్ద కుమార్తె భవాని తండ్రికి ముందు నడిచి తలకొరివి పెట్టింది. తల్లిని, తండ్రిని కోల్పోయి అనాఽథలైన అక్కాచెల్లెళ్ల పరిస్థితిచూసి ప్రతీ ఒక్కరు కంట తడిపెట్టారు.