Share News

రూ.25వేల పరిహారం అందజేయాలి

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:03 AM

ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వడంతోపాటు గిట్టుబాటు ధరకు మద్దతుగా బోనస్‌ చెల్లించాలని రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు కొల్పుల అమరేంద ర్‌ డిమాండ్‌ చేశారు.

రూ.25వేల పరిహారం అందజేయాలి

బీఆర్‌ఎస్‌ నేతల డిమాండ్‌

భువనగిరి అర్బన్‌, ఏప్రి ల్‌ 2: ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వడంతోపాటు గిట్టుబాటు ధరకు మద్దతుగా బోనస్‌ చెల్లించాలని రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు కొల్పుల అమరేంద ర్‌ డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ లో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ ఎం. నాగేశ్వరచారికి బీఆర్‌ఎస్‌ తరఫున వినతిపత్రం అందజేసి మాట్లాడారు. పంట నష్టం కింద ఎకరాకు రూ.25వేలు ఇవ్వాలని, రైతుకు గిట్టుబాటు ధరతోపాటు రూ.500బోనస్‌ అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వినతిపత్రం అందజేసినవారి లో భువనగిరి మునిసిపల్‌ మాజీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నబోయిన ఆంజనేయులు, చిం తల కిష్టయ్య, జడ్పీటీసీ బీరుమల్లయ్య, భూదాన్‌పోచంపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ భూపాల్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు ఎంవీ కిరణ్‌కుమార్‌, సుధాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 12:03 AM