Share News

TS News: తల్లి సహా మరో మహిళను నరికేసిన సైకో.. పోలీసుల హై అలర్ట్..

ABN , Publish Date - Jan 05 , 2024 | 09:16 AM

తల్లి సహా మరో మహిళను ఓ వ్యక్తి నరికేశాడు. పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రేగొండ మండలం తిరుమలగిరిలో ఓ సైకో వీరంగం సృష్టించాడు.

TS News: తల్లి సహా మరో మహిళను నరికేసిన సైకో.. పోలీసుల హై అలర్ట్..

జయశంకర్ భూపాలపల్లి : తల్లి సహా మరో మహిళను ఓ వ్యక్తి నరికేశాడు. పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రేగొండ మండలం తిరుమలగిరిలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. కంచరకుంట్ల రాజిరెడ్డి అనే వ్యక్తి సైకో మాదిరిగా మారి అర్ధరాత్రి తల్లి హైమ(60)తో సహా మరో మహిళ ఊకంటి జ్యోతి (50)ని నరికేశాడు. తల్లి అక్కడికక్కడే మృతి చెందగా.. జ్యోతి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. పోలీసులు సైకో కోసం గాలిస్తున్నారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని తిరుమలగిరి గ్రామస్తులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

Updated Date - Jan 05 , 2024 | 09:16 AM