Share News

ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తాం: హనుమంతరావు

ABN , Publish Date - Mar 12 , 2024 | 11:53 PM

చిన్నశంకరంపేట, మార్చి 12: ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు.

ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తాం: హనుమంతరావు
ఫిక్స్‌ డిపాజిట్‌ పత్రాలను అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు

చిన్నశంకరంపేట, మార్చి 12: ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. మంగళవారం చిన్నశంకరంపేట మండలంలోని రామాయపల్లి గ్రామంలో ఎమ్‌ఎ్‌సఎ్‌సవో ద్వారా తల్లిదండ్రులు లేని పిల్లల పేరుతో రూ.25 వేలు బ్యాంకు డిపాజిట్‌ బుక్కులను బాధిత కుటుంబీకులకు అందజేసి మాట్లాడారు. మైనంపల్లి కుటుంబం పేదలకు అండగా ఉంటుందన్నారు. ప్రజలకు ఏకష్టమచ్చిన తమ కష్టంగా భావిస్తామన్నారు. ఎమ్మెల్యే రోహిత్‌రావు సహకారంతో గ్రామాలాభివృద్ధికి తమవంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి సుభ్రబాతరావు, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు సత్యనారాయణ, డీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీమాన్‌రెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నరేందర్‌, మాజీ ఎంపీపీ అరుణ పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 11:53 PM