Share News

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:44 PM

ప్రభుత్వ ఉపాధ్యాయులు

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
ఈజీఎస్‌ కూలీలకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పిస్తున్న దృశ్యం

నంగునూరు, జూన్‌ 8: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తున్నదని నంగునూరు హైస్కూల్‌ ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా శనివారం నంగునూరు ఉన్నత పాఠశాల, ఘనపురం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఘనపురం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధిహామీ కూలీల వద్దకు వెళ్లి ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యాబోధన లభిస్తున్నదని, అలాగే ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్‌, రెండు జతల యూనిఫామ్స్‌ అందిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సత్యనారాయణరెడ్డి, రాజీరెడ్డి, వంశీకృష్ణ, ఘనాపూర్‌ ఉపాధ్యాయులు వెంకటేశం, సువర్ణ, నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2024 | 11:44 PM