ముస్లింలకు జగ్గారెడ్డి రంజాన్ శుభాకాంక్షలు
ABN , Publish Date - Apr 06 , 2024 | 12:27 AM
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మెదక్ జిల్లాలోని ముస్లింలకు మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
![ముస్లింలకు జగ్గారెడ్డి రంజాన్ శుభాకాంక్షలు](https://media.andhrajyothy.com/media/2024/20240326/fire2_e96c349731.gif)
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, ఏప్రిల్ 5 : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మెదక్ జిల్లాలోని ముస్లింలకు మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం సాయంత్రం సంగారెడ్డిలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. విందు సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింల భక్తి శ్రద్ధలకు ప్రతీక రంజాన్ పవిత్రమాసమని జగ్గారెడ్డి అన్నారు. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మైనారిటీలకు కాంగ్రెస్ ఇచ్చిన హమీలన్నిటినీ అమలు పరచి తీరతామన్నారు. ఈ విందులో వక్ఫ్బోర్డ్ చైర్మన్అజ్మతుల్లా హుస్సేనీ, టీఎ్సఐఐసీ చైర్పర్సన్నిర్మలా జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.