Share News

ఓట్ల పండుగ.. ఆదాయం దండిగా!

ABN , Publish Date - May 15 , 2024 | 11:35 PM

నాలుగు రోజుల్లో ఆర్టీసీకి రూ.4.30 కోట్లు

ఓట్ల పండుగ.. ఆదాయం దండిగా!

మెదక్‌ రీజియన్‌కు సమకూరిన ఆదాయం

సంగారెడ్డి అర్బన్‌, మే 15 : లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఓటర్లు తమ స్వస్థలాలకు పయనం కావడంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది. మెదక్‌ రీజియన్‌ పరిధిలోని ఎనిమిది డిపోల నుంచి ఎన్నికల నిమిత్తం 323 బస్సు సర్వీసులు అదనంగా నడిపారు. మరో 17 బస్సులను ఏపీకి తిప్పారు. సుమారు 10,36,200 మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేశారు. దీంతో మెదక్‌ రీజియన్‌కు రూ.4.30 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ నెల 11వ తేదీ నుంచి 14 వరకు అదనంగా లక్షా 13 వేల కిలోమీటర్లను తిప్పినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మెదక్‌ రీజియన్‌లోని సిద్దిపేట డిపోకు ఈ సారి ఎక్కువ ఆదాయం సమకూరగా, ఆ తర్వాత మెదక్‌ డిపోకు వచ్చింది.

Updated Date - May 15 , 2024 | 11:35 PM