Share News

పెండింగ్‌ పనులను పూర్తి చేస్తాం

ABN , Publish Date - Feb 02 , 2024 | 11:02 PM

పట్టణంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను అధికారుల తో కలిసి పూర్తి చేస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూద న్‌రెడ్డి అన్నారు.

పెండింగ్‌ పనులను పూర్తి చేస్తాం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి

- ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి

కొత్తకోట, ఫిబ్రవరి 2 : పట్టణంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను అధికారుల తో కలిసి పూర్తి చేస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూద న్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మునిసిపాలిటీ చైర్‌పర్సన్‌ సుకేశిని అధ్యక్షతన నిర్వహించి న బడ్జెట్‌ సమావేశానికి ఆయ న కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ నీటి ఎద్దడిని నివారించడానికి కలెక్టర్‌ స్పందించడం అభినందనీయమన్నారు. 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నమన్నారు. 24 గంటల విద్యుత్‌ సరఫరా లో ఎవరు సందేహ పడాల్సిన అవసరం లేదన్నారు. మార్కెట్‌, రోడ్ల విస్తరణ పనులు తిరిగి ప్రారంభిం చుకుందామన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అధికారు లు, కౌన్సిలర్లు సమన్వయంతో పని చేసి పట్టణాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలన్నారు. వేసవిలో నీటిని వృఽథా చేయకుండా అన్ని కాలనీలకు అందే విధంగా కృషి చేయాలని సూచించారు. ప్రజలకు అధికారులు జవాబుదారీగా ఉన్నప్పుడే పన్నులు సకాలంలో వసూలు అవుతాయని అన్నారు. కౌన్సిల్‌ ప్రవేశ పెట్టిన రూ.9.13 కోట్ల బడ్జెట్‌ను అమోదిం చారు. సమావేశంలో కనిషనరు శ్రీనివాస్‌, వైస్‌ చైర్‌ పర్సన్‌ జయమ్మ, కౌన్సిలర్లు కొండారెడ్డి, రాములు యాదవ్‌, నారాయణమ్మ, సంధ్య, సంధ్యారెడ్డి, నవీన్‌ కుమార్‌రెడ్డి, నాగన్న సాగర్‌, తిరుపతి, మహేశ్వరి, భరత్‌ భూషణ్‌, ఖాజామైనోద్దీన్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 11:02 PM