Share News

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:06 PM

భాదిత కుటుంబాలకు అండగా ఉంటామని అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు అన్నారు.

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
బాధిత కుటుంబ సభ్యులకు బీమా చెక్కును అందిస్తున్న ఎమ్మెల్యే విజయుడు

- అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు

ఎర్రవల్లి, ఫిబ్రవరి 29 : భాదిత కుటుంబాలకు అండగా ఉంటామని అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఎర్రవల్లి మండలంలోని గురువారం రాజశ్రీ గార్లపాడు గ్రామానికి రైతు చాంద్‌ ఇటీవల మృతి చెందాడు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం నుంచి రైతుబీమా కింద ఐదు లక్షల రూపాయలు మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన చెక్కును గురువారం రైతు భార్య సుజాతమ్మకు అందించారు. బాధిత కుటుంబం పూరి గుడిసెలో నివసిస్తుండటం చూసిన ఆయన గృహజ్యోతి కింద ఇల్లు మంజూర య్యేలా కృషి చేస్తామని చెప్పారు. అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ సుదర్శన్‌రెడ్డి, నాయకులు రఘురెడ్డి, గ్రామస్థులు పెద్ద భీముడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 11:06 PM